కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానిక కార్యకర్త నిలదీత.. ‘ముందు సొంత ఊరిని చూసుకోండి’ అంటూ ప్రశ్నలు

కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానికంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, మంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే ఓ సీనియర్ కార్యకర్త, సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా సొంత ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించిన తర్వాత ఇతర ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడాలని కోరారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం సింగాయిపల్లిలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు…

Read Full News

జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన వేలాది మంది

రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోమవారం వేలాది మంది ఉద్యోగార్థులు జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు ఇప్పటికే 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ…

Read Full News

చేయూత పెన్షన్లలో భారీ అక్రమాలు బట్టబయలు.. మరణించిన వారి పేర్లపైనా కొనసాగిన పెన్షన్లు!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియలో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 15.93 లక్షల మంది లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేశారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 83.88 శాతం…

Read Full News

సీఎంకు కొత్త హెలికాప్టర్? నెలకు రూ.5 కోట్ల కిరాయి.. గంటకు రూ.10 లక్షల ఖర్చు – ప్రజల డబ్బుపై మరో భారం?

తెలంగాణ ముఖ్యమంత్రి వినియోగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ హెలికాప్టర్‌కు నెలకు సుమారు రూ.5 కోట్ల వరకు అద్దె, గంటకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందనే సమాచారం వెలుగులోకి రావడంతో ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, మరోవైపు సంక్షేమ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపణలు…

Read Full News

తెలంగాణలో అసలు ప్రజా సమస్యలు పక్కనబెట్టి చిన్న విషయాలపై హంగామా — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

డిజిటల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ల పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిన్న చిన్న విషయాలను అతిశయోక్తిగా చూపిస్తూ పేదల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో విలువలు తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్లు తక్కువ ధరకు అమ్ముకునే ఆహార పదార్థాలపై ప్రశ్నించడం కంటే, రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం, విద్యా వ్యవస్థ సమస్యలు, సంక్షేమ…

Read Full News

ఆత్మభిమానం ఎక్కడ పోయింది? పాపపు సొమ్ముతో పాలన చేస్తారా? కళ్యాణలక్ష్మి – తులం బంగారం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసిన ప్రభుత్వం

ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల…

Read Full News

పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన

రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…

Read Full News

హైకోర్టు ఆగ్రహం: RTI అమలు లోపాలు, ఇంటర్ బోర్డు అవకతవకలు, రేవంత్ రెడ్డి వివాదాలు

తెలంగాణలో RTI అమలు లోపాలపై హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలంబర్తి మరియు ఆర్వీ కర్ణన్ తీరుపై కోర్టు నోటీసులు జారీ చేసి, వచ్చే నెల 26లో వివరణ సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం విశేషంగా ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయంగా, మెక్సికో భారత్‌పై 50% దిగుమతి సుంకాలు ప్రకటించింది. ఇది స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయం, చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలపై ఆధారపడకూడదని తెలిపింది. ఈ నిర్ణయం భారత కార్ల…

Read Full News

ఆర్టిఐ సమాచారం ఇవ్వని ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం – ఇంటర్ బోర్డు అవకతవకలు, మెక్సికో సుంకాలు, సీఎం వ్యక్తిగత వ్యాఖ్యలపై వివాదం

ఆర్టిఐ కింద సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలంబర్తి మరియు ఆర్వీ కర్ణన్ కేసులో కోర్టు నోటీసులు జారీ చేస్తూ, వచ్చే నెల 26లోపు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడం విచారకరం అని వ్యాఖ్యానించింది. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలో మరో ప్రధాన పరిణామంగా, మెక్సికో భారత్‌పై 50% దిగుమతి సుంకాలు ప్రకటించింది. చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలపై…

Read Full News

ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

Read Full News