రాయదుర్గం ఎకరం ₹237 కోట్లు.. రైతుల భూములకు అదే రేటు ఇస్తారా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో భూముల విలువలు, రైతుల నష్టపరిహారం అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో టీజీఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ₹237 కోట్లకు చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 6.29 ఎకరాల భూమిని ₹1490.73 కోట్లకు గౌర వెంచర్స్ దక్కించుకోవడంతో.. “ప్రభుత్వ భూమికి వందల కోట్లు వస్తే రైతు భూమికి ఎందుకు రావు?” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. రావిర్యాల ప్రాంతంలో…

Read More

పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read More

హైడ్రా నెక్స్ట్ 10 ఇయర్స్ బ్లూప్రింట్.. హైదరాబాద్ చెరువుల రంగనాథ్ ఐపీఎస్ భారీ ప్రణాళిక

హైదరాబాద్ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైడ్రా సంస్థ వచ్చే పదేళ్లకు భారీ బ్లూప్రింట్ సిద్ధం చేస్తోందని హైడ్రా కమిషనర్ Ranganath వెల్లడించారు. వేటు న్యూస్ కాంక్లేవ్ 2026లో “హైడ్రా బ్లూప్రింట్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్” అంశంపై మాట్లాడిన ఆయన, నగరంలో పెరుగుతున్న జనాభా, భూములపై ఒత్తిడి, చెరువుల ఆక్రమణలు, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు హైడ్రా కీలకంగా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా హైడ్రా రెండు ప్రధాన…

Read More

హైదరాబాద్ చెరువుల రక్షణలో హైడ్రా దూకుడు.. 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌తో భారీ మార్పులు!

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న హైడ్రా, నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేస్తోందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఆనంద్ థియేటర్ సమీపంలోని నాలా ఆక్రమణలను తొలగించిన ఘటనను అధికారులు ఉదాహరణగా చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఆక్రమణల కారణంగా నాలా వెడల్పు భారీగా తగ్గిపోయి, వర్షాకాలంలో…

Read More

మూసి అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వ యూటర్న్.. ముందే నిర్ణయం తీసుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవారా?

మూసి పునర్జీవన ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇండ్ల నష్టం తగ్గించేలా అలైన్‌మెంట్ మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించడం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే — ఇదే నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఇంత మంది ఇళ్లపై భయం, ఆందోళనలు, నిరసనలు అవసరమయ్యేవా? ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే పలువురు నిపుణులు,…

Read More

హైదరాబాద్‌లో టిడిఆర్ బిగ్ స్కామ్ ఆరోపణలు: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ దందా?

హైదరాబాద్ నగరంలో తాజాగా టిడిఆర్ (Transfer of Development Rights) బాండ్లపై భారీ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ వ్యవహారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా కొన్ని రాజకీయ నేతల అనుచరులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిడిఆర్ బాండ్ల వ్యవస్థను ఉపయోగించి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. గతంలో 22% నుంచి 27% మధ్య ఉన్న టిడిఆర్…

Read More

హైదరాబాద్‌లో 8 కోట్ల భూమి వివాదం… మల్లు రవి కుటుంబానికి కేటాయింపుపై రాజకీయ దుమారం

తెలంగాణ రాజకీయాల్లో మరో భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబానికి సంబంధించిన భూమి కేటాయింపు అంశం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య రాజాబంశీ దేవి మల్లుకు దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ పరిధిలో ఉన్న 233 గజాల భూమి 2012 సంవత్సరం నుంచే పెండింగ్‌లో ఉందని సమాచారం. దాదాపు 12…

Read More

ఔటర్ వరకు గ్రేటర్: జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనంపై రాజకీయ దుమారం

ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసిలో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి లక్ష్యమా లేదా రియల్ ఎస్టేట్ లాభాల కోసమా అనే ప్రశ్నలు ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో, తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఔటర్ వరకు గ్రేటర్…మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇలా మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేశారు. పెద్దంబర్పేట,…

Read More

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భూకుంభకోణం అంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భారీ భూకుంభకోణమని బీఆర్‌ఎస్ ఆరోపణలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూముల మార్పిడి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ మార్పిడికి అనుమతించే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ఈ స్కామ్ జరుగుతోందని పార్టీ ప్రతినిధులు విమర్శించారు. పారిశ్రామిక భూములు…

Read More

కానామెడ్ అసైన్డ్ భూముల వివాదం: అధిక భూదరలు, నిర్మాణాలు, అధికారుల వైఖరిపై ఆరోపణలు

శేర్లింగ్‌పల్లి పరిధిలోని కానామెడ్ ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు, హై–రైజ్ నిర్మాణాలపై వివాదం చెలరేగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షలకు పైబడిందనే సమాచారం వెలువడుతోంది. గత ప్రభుత్వ కాలంలో కూడా అసైన్డ్ భూములకు అధిక ధర పలికిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రాంతంలో హై–రైజ్ బిల్డింగ్స్ నిర్మాణం, అసైన్డ్ ల్యాండ్స్ డీల్‌లపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల చర్యలు తగిన స్థాయిలో లేవని ఆరోపణలు ఉన్నాయి. డెప్యూటీ…

Read More