అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read Full News

జగిత్యాల అభివృద్ధే లక్ష్యం: పార్టీ ఏదైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తా – ఎమ్మెల్యే స్పష్టం

జగిత్యాల పట్టణ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన అనేక మందికి రావాల్సిన బిల్లులు, హక్కులు ఇప్పించానని, అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎవరు సహకారం కోరినా వెనకాడనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త కాదని పేర్కొన్న ఎమ్మెల్యే, పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తు…

Read Full News

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ అరవింద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన ఓటమి జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భోగా శ్రావణిపై టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….

Read Full News

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కలకలం: బీ–ఫామ్ హామీలతో మోసం, వరుస రాజీనామాలు

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగులుతోంది. బీ–ఫామ్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో అభ్యర్థులను మోసం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే మల్రెడ్డి సహా పలువురు నాయకులు చివరి క్షణం వరకు బీ–ఫామ్ ఇస్తామని చెప్పి, నామినేషన్లు వేయించుకున్న తర్వాత అభ్యర్థులను పక్కన పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన కార్యకర్తలనే విస్మరించి, కొత్తగా వచ్చిన వారికి…

Read Full News