కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read Full News

“రైతులపై ప్రజా వంచన పాలన.. కాళేశ్వరం పునరుద్ధరణతోనే తెలంగాణకు మంచి రోజులు: బీఆర్ఎస్ విమర్శలు”

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని, ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఏర్పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ, రెండు పియర్లు దెబ్బతిన్నప్పటికీ 30 నెలలు గడిచినా మరమ్మతులు పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, అనేక జిల్లాల…

Read Full News

80% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే ఏ శిక్షకైనా సిద్ధం”.. సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ సవాల్

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో 80 శాతం పంట కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిజంగానే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితిలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “80…

Read Full News

రైతుల పేరుతో రాజకీయాలేనా?.. పంట కొనుగోళ్లపై ప్రభుత్వం-ప్రతిపక్షాలపై మండిపాటు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్న వేళ రాజకీయ పార్టీలు మాత్రం పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతులు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం “మొద్దు నిద్ర”లో ఉన్నారని…

Read Full News