కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బీజేపీ ప్రశ్నలపై తిరిగి బీజేపీకే ప్రశ్నలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇదే ప్రశ్నను బీజేపీపై వేసుకుంటే పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ విచారణకు అప్పగించాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ, చివరకు…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు – నందినగర్ నివాసంలోనే విచారణకు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది. ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read Full News

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవాలపై రాజకీయ డ్రామా

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవం కాదా? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణలను తప్పు పట్టడం ఒక కొత్త రాజకీయ ఫ్యాషన్ అయిపోయింది.విచారణ అంటేనే కక్షపూరిత చర్య అని కొందరు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ అసలు ప్రశ్న ఇది — విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఫోన్ టాపింగ్ జరిగిందా? జరిగింది ఇది ఆరోపణ కాదు.ఇది అనుమానం కాదు.ఇది రాజకీయ వ్యాఖ్య కాదు. ఫోన్ టాపింగ్ జరిగింది — అది వాస్తవం.పోర్ట్ టాపింగ్…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు, అరెస్ట్ ప్రచారం రాజకీయ హైప్ మాత్రమే

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని…

Read Full News

మంత్రి భేటీలపై విషప్రచారం తగదు: పాలనపరమైన అంశాల కోసమే సమావేశాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం

మంత్రి భేటీలపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. పాలనపరమైన అంశాలపై మంత్రులతో భేటీ అవడాన్ని రహస్య సమావేశాలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన సూచన మేరకే మంత్రులతో సమావేశం అయినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రులు…

Read Full News

ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌లో అంతర్గత దయ్యాలు: సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు, కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ఉద్యమకారులకు దూరమవుతున్న పార్టీ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా సంతోష్ రావు ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, అమరవీరుల కుటుంబాలు, పేద ప్రజలకు దూరమవడానికి కారణం ఒక వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు పార్టీ విడిచిపోవడానికి కూడా ఇదే…

Read Full News

ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు వద్దు: ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతిఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ అనర్హుడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మికులు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారాలు మీడియాలో వస్తుండటంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో డేటా ధ్వంసం మిస్టరీ: కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం, విచారణపై సందేహాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశం ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా చర్చకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌ల డేటాను ఎందుకు ధ్వంసం చేశారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాజకీయ సీరియల్: ఆరోపణలు మాత్రమే, అరెస్టులు శూన్యం

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విచారణను పూర్తిగా రాజకీయ పంచాయతీగా అభివర్ణించారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిచారని, దాదాపు ఏడు నుంచి ఎనిమిది…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా…

Read Full News