స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్.. ప్రజల్లో మళ్లీ ఆందోళన ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution Sector Scheme) పథకంలో చేరేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఇప్పుడు రాజకీయంగా, ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దశలవారీగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు, ఆందోళనలు తగ్గడం లేదు. గతంలో కూడా స్మార్ట్ మీటర్ల అంశం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో…

