రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read Full News

కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. బిఆర్ఎస్–బీజేపీ పొత్తుపై ఊహాగానాలకు బలం?

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తరఫున ప్రత్యేకంగా చెప్పాలని బిఆర్ఎస్ ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దిక్కొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని…

Read Full News

బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

అంత ఇంత గలీజ్ కాదు! నల్లగొండలో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూసిన చిల్లర రాజకీయాల భయానక రూపం

రాజకీయం రోజురోజుకీ ఎంత దిగజారిందంటే, అది చూసి ప్రజాస్వామ్యానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రాజకీయ వ్యవస్థ ఎంత చిల్లర స్థాయికి పడిపోయిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన యాదగిరి అనే వ్యక్తిపై అమానుషంగా దాడి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

Read Full News

నల్గొండ కోర్టు సంచలన తీర్పు నుంచి హైదరాబాద్ పోలీస్ శాఖ అంతర్గత విచారణ వరకు

భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో హృదయ విదారక ఘటనలో ఐదుగురు పిల్లలకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు సమాజాన్ని కుదిపేస్తున్నాయి. ఇదిలా ఉండగా, నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. రాత్రి 1 గంట వరకే…

Read Full News

రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను చర్చించాలన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల పాలనలో ప్రభుత్వం సాధించిన “విజయాలు” ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి….

Read Full News

ఫుట్‌బాల్ షోతో 200 కోట్ల ప్రశ్నలు: రేవంత్ రెడ్డి ప్రచారంపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫుట్‌బాల్ షో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఫుట్‌బాల్ కార్యక్రమం చుట్టూ భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆడలేని వ్యక్తి ఆడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం, పక్కన టీమ్ బాల్ తీసుకొచ్చి ఇస్తే ఒకచోట నిలబడి తన్నడం తప్ప నిజమైన ఆట లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫుట్‌బాల్ ఈవెంట్‌కు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఖర్చుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం…

Read Full News

పంచాయతీ ఎన్నికల తర్వాత రాజకీయ వేడి: బీఆర్‌ఎస్ పునరుజ్జీవనా? రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షోపై ప్రశ్నలు, 19వ తేదీపై ఉత్కంఠ

గ్రామాలకు వెళ్లి ఓటు వేసి తిరిగి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు కిటకిటలాడాయి. హైదరాబాద్‌లో ఎన్నికల పట్ల కనిపించని ఆసక్తి, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం “మా ఊరు – మా సర్పంచ్” అనే భావోద్వేగంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి మెచ్చుకోదగిన అంశమే. అధికార పార్టీ సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధిస్తుందన్న అంచనాల మధ్య కూడా, బీఆర్‌ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ గట్టి పోటీ…

Read Full News

ఫుట్‌బాల్‌పై కోట్లు… రైతు బంధు, ఉద్యోగాలపై మౌనం: గుంపు మేస్త్రి పాలనపై పావని గౌడ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు పెరుగుతున్న వేళ, పావని గౌడ్ తీవ్ర వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఫుట్‌బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని ఆమె నిలదీశారు. రైతు బంధుకు నిధులు లేవని, గురుకులాల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఫుట్‌బాల్ కోసం మాత్రం…

Read Full News