ఓటు విలువ కోటరు సీసా కాదు – గ్రామ రాజకీయాలపై ప్రశ్నలు”

గ్రామస్థాయిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఓటు విలువను, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా, ఓటును కోటరు సీసాలు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి కొనేసే పరిస్థితి బాధాకరంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నోటికి ఓటు, ఊరికి వెన్నుపోటు” అనే విమర్శలు ఈ ఎన్నికల్లో మరింతగా వినిపిస్తున్నాయి. ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్ల భవిష్యత్తు తాకట్టు పెట్టేయడం ప్రజాస్వామ్యంపై అవమానమా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఒక సర్పంచ్ నెలజీతం ₹6,500 మాత్రమే….

Read Full News

ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

Read Full News

గ్లోబల్ సమ్మిట్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారా? – మంత్రులపై సంచలన ఆరోపణలు”

తెలంగాణలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్‌ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అసలు ఎవరికి లాభం చేకూరుతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఏ కంపెనీలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. “84వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం” అని…

Read Full News

సాయిశ్వరాచారి మరణం.. బీసీల కేక — హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఎక్కడ?”

తెలంగాణలో మరోసారి ఉద్యమ జ్వాలలు రగులుతున్నాయి.ఆనాటి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి తన శరీరానికి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే చరిత్రను మళ్లీ ప్రజలు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ సాయి ఈశ్వరాచారి తనను తాను నిప్పంటించుకోవడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నా… కుటుంబం ఎలా బతుకుతుందని ఆలోచించే సమయం లేకుండా,“బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి” అనే నినాదంతో ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఉద్యమ నాయకులు…

Read Full News

సాయిశ్వరాచారి మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య!

సాయిశ్వరాచారి మరణం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరికి కేవలం 17% మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఉద్యమకారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ: “ఈ మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వం చేసిన హత్య. ఈ మోసపు పాలనే సాయిశ్వరాచారిని చంపింది.” అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుల మాటల్లో: “42% రిజర్వేషన్ మాట ఇచ్చి నమ్మబలికి,…

Read Full News

బీసీ రిజర్వేషన్ల హామీ తప్పించిన కాంగ్రెస్ పాలన కారణంగానే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య: ఉద్యమ నాయకుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై వివాదం మళ్లీ తీవ్రమైంది. రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతోనే బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీసీ సంఘాలు, ఉద్యమ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమ నాయకులు మాట్లాడుతూ, “మాజీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించాడు. ఈరోజు బీసీల హక్కుల కోసం మరోసారి సాయి ఈశ్వరాచారి బలి కావడం దురదృష్టకరం, దారుణం” అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణలు…

Read Full News

42% రిజర్వేషన్ హామీ తప్పించిన రేవంత్‌పై బీసీల ఆగ్రహం: బీసీ యువకుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత”

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయం వేడెక్కిస్తోంది. 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు కాలేదన్న ఆవేదనతో బీసీ కులానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానాలను ప్రశ్నించారు. “ఒక బీసీ బిడ్డ…

Read Full News

సాయి ఈశ్వరాచారి మరణం: బీసీ రిజర్వేషన్‌పై ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బీసీ వర్గానికి చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యయత్నం చేసి తరువాత మరణించడం రాష్ట్రవ్యాప్తంగా భారీగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ మరణం కాదని, రాజకీయ హామీల మోసం చేయడంతో వచ్చిన నిరాశ, ఆవేదన ఈ పరిణామానికి దారితీసిందని బీసీ సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన హిమాయత్‌నగర్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు జరిగింది. అక్కడే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్‌ను వెంటనే స్థానికులు…

Read Full News

ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read Full News

సర్పంచ్ ఎన్నికల ఫోన్ టెన్షన్: అభ్యర్థుల డబ్బు డిమాండ్లతో ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్

సర్పంచ్ ఎన్నికల పరుగులో తెలంగాణ రాజకీయాలు హీట్‌కి చేరాయి. కానీ ఈసారి చర్చవుతున్నది అభ్యర్థుల ప్రచారం కాదు… అభ్యర్థులు ఎమ్మెల్యేలకు చేస్తున్న ఫోన్ కాల్స్.ఎందుకంటే ఆ ఫోన్లు సలహాల కోసం కాదు… డబ్బు కోసం. మూడు రోజులుగా చాలామంది బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్ నంబర్ చూసి కాల్స్‌ను ఇగ్నోర్ చేస్తున్నారు.కారణం ఒకటే — సర్పంచ్ అభ్యర్థుల నుండి వచ్చే డబ్బు డిమాండ్లు. 🏘️ ఒక నియోజకవర్గంలో 100–120 గ్రామాలు… ఒకరికి ఇచ్చారు అంటే మిగతావాళ్లు…

Read Full News