కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read Full News

2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read Full News

2025లో బిఆర్ఎస్–బిజెపీలకు చేదు అనుభవాలు.. కవిత బాంబు, బీజేపీ అంతర్గత కలహాలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్, బిజెపీలకు తీవ్రంగా కలిసి రాని ఏడాదిగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ విషయంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న స్టాండ్ పార్టీకి పెద్ద షాక్‌గా మారాయి. ఈ పరిణామాన్ని చాలామంది “కవిత బాంబు”గా అభివర్ణిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడటం, కుటుంబ సభ్యురాలే బహిరంగంగా మాట్లాడటం పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025లో బిఆర్ఎస్‌కు వరుసగా ఎదురైన ప్రతికూల పరిణామాలు, జూబ్లీ హిల్స్…

Read Full News

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…

Read Full News

స్త్రీ వస్త్రధారణ, సనాతన ధర్మం వివాదంపై బీజేపీ నేత రవికుమార్ వ్యాఖ్యలు

ఇటీవల స్త్రీల వస్త్రధారణపై మొదలైన చర్చ, క్రమంగా సనాతన ధర్మం, సంస్కృతి అంశాలకు ముడిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా బీజేపీ నాయకులు రవికుమార్ గారు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తాను సమర్థిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. మాటల ప్రవాహంలో కొన్ని పదాలు దొర్లి ఉండవచ్చని అంగీకరిస్తూనే, సమాజంపై ప్రభావం చూపే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వస్త్రధారణ, భాష, ప్రవర్తన అన్నీ సమాజంపై ప్రభావం…

Read Full News

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు…

Read Full News

ప్రజాసేవే లక్ష్యం… వరంగల్ వరద నష్టాలు, కృష్ణానగర్ సమస్యలపై అసెంబ్లీలో తొలి ప్రసంగం

తెలంగాణ శాసనసభ వేదికగా తొలి ప్రసంగం చేసిన సభ్యుడు భావోద్వేగంగా మాట్లాడారు. మంత్రులు, సభ్యులు, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి తన పేరును ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రెండేళ్ల లోపే శాసనసభ సభ్యుడిగా ఈ సభలో అడుగుపెట్టడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే తనను…

Read Full News

సభా సాంప్రదాయాలు దిగజారుతున్నాయి… భాషపై రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జాఫర్ హుసేన్

సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు,…

Read Full News

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read Full News

నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నదీ జలాలే ప్రధాన అజెండా.. సభకు హాజరుకానున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ…

Read Full News