విద్యార్థులు రోడ్లపై.. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్క సమస్య కాదు.. అనేక సమస్యలు ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు..పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు..టీచర్ల కొరత..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఫిర్యాదులు..గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు..ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు.. ఇలా చూస్తే తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో.. ఇన్ని శాఖలను ఒకేసారి…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి స్కూళ్ల వరకు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, విద్యా విధానాలపై వస్తున్న విమర్శలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులని, ఈ రెండు రంగాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల…

Read Full News

విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అర్హుడికి అప్పగిస్తే విద్యార్థుల సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది!

తెలంగాణలో విద్యాశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. “విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి? సమాజ మార్పు కోసమే ఈ శాఖను నా వద్ద ఉంచుకున్నాను. 2034 వరకు నేనే సీఎం టీం లీడర్‌గా కొనసాగుతాను. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే నా లక్ష్యం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం ప్రకారం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, టీచర్ల…

Read Full News

ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నూతన విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ప్రధాన శక్తి విద్యేనని, విద్యావంతులైన యువతే రేపటి తెలంగాణకు బలమైన…

Read Full News

తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏబీవీపీ ఆగ్రహం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి

తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే…

Read Full News

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం.. 2026-27 అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు మార్గదర్శకాలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15గా నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండనున్నాయి. 2027 ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించగా, అనంతరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 13…

Read Full News

రికార్డ్ టెన్త్ ఫలితాలు.. 95% పాస్.. ములుగు టాప్.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో రిజల్ట్!

రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదై విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ శాతం 2.37% పెరగడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు మరోసారి అద్భుత ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే మరోవైపు లక్షల ఫీజులు వసూలు చేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో ఏకంగా ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి…

Read Full News