ఆపరేషన్ కొండా.. సురేఖ రాజీనామా చేస్తారా? లేక మంత్రివర్గ ప్రక్షాళనతో సమస్యకు చెక్?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ వేదికగా కీలక చర్చలు జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సురేఖను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తోందా? ఆమె అందుకు అంగీకరించకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఒకవేళ ఆమెపై నేరుగా చర్యలు తీసుకుంటే పార్టీకి కొత్త సమస్యలు వస్తాయా? అనే అంశాలపై కాంగ్రెస్‌లో విస్తృతంగా…

Read Full News

ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. రోజురోజుకీ ముదురుతున్న వివాదం? పార్టీ పదవులపై మరోసారి కోటాపోటి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ప్రభుత్వ శాఖలు, అధికార వ్యవహారాల విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు వినిపించగా.. ఇప్పుడు పార్టీ పదవుల విషయంలోనూ పోటీ నెలకొన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహార శైలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినప్పటికీ, కీలక నిర్ణయాల విషయంలో ఢిల్లీ మరింత చురుకుగా వ్యవహరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాలపై హైకమాండ్ పర్యవేక్షణ పెరిగిందా? లేక ఇది కాంగ్రెస్ పార్టీ సహజమైన సమన్వయ ప్రక్రియలో భాగమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహార శైలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినప్పటికీ, కీలక నిర్ణయాల విషయంలో ఢిల్లీ మరింత చురుకుగా వ్యవహరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాలపై హైకమాండ్ పర్యవేక్షణ పెరిగిందా? లేక ఇది కాంగ్రెస్ పార్టీ సహజమైన సమన్వయ ప్రక్రియలో భాగమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు…

Read Full News

కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read Full News

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read Full News

రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్.. మంత్రివర్గంలో భారీ మార్పుల సంకేతాలు?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ-ప్రభుత్వ సమన్వయం వంటి అంశాలపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్…

Read Full News

గోదావరి జలాలపై వివాదం: తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు

గోదావరి జలాలపై తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర జల సంఘం (CWC) సమావేశం నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12న విడుదల కాగా, అందులో గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా అంశాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాల విషయంలో…

Read Full News

మిర్యాలగూడ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు – మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఉత్తం కుమార్ రెడ్డి

మిర్యాలగూడ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని సహకార శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇది ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ప్రాంతమని, వ్యాపార వర్గాలు, రైతులు కష్టపడి జీవించే ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని భారీ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా…

Read Full News