మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం… ప్రజల సేవే లక్ష్యమంటూ విజేతల కృతజ్ఞతాభివందనం

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మీడియా సమావేశంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 19 గ్రామాల ప్రజలు తమపై విశ్వాసం ఉంచి గెలిపించారని, ఈ విజయం ప్రజలదేనని పేర్కొన్నారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. 25వ వార్డు నుంచి విజయం సాధించిన అభ్యర్థి మాట్లాడుతూ, తనను గెలిపించిన సుభాష్ నగర్ కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకుల మద్దతు…

Read Full News

ఏకగ్రీవాల పేరుతో బెదిరింపుల రాజకీయం: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హైడ్రామా

మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపుల రాజకీయానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు, బెదిరింపులు, రాజకీయ డ్రామాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లు వేసే పరిస్థితి కూడా లేకుండా, ముందే ఏకగ్రీవాల పేరుతో ఫలితాలను ఖరారు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా “80 శాతం ప్రజాభిమానము కాంగ్రెస్‌కే ఉంది”…

Read Full News

వికారాబాద్ 17వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిని – అభివృద్ధే లక్ష్యమని ప్రకటన

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. “నా తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ, ఆయన అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను ఇక్కడే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను” అని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం…

Read Full News

వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ పూర్తి బలం: 34 వార్డులకు 34 అభ్యర్థులు – మోడీపై పెరిగిన ప్రజల నమ్మకం

వికారాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. మున్సిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు 34 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించడం పార్టీ బలానికి నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులే లేవని విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులే, ఈరోజు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా, సర్పంచ్ ఎన్నికల్లో ఒకరి నుంచి 24 మందికి ఎదిగిన పార్టీగా బీజేపీ ఎదుగుదలను గమనిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల నమ్మకం…

Read Full News