రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ..? నిరుద్యోగుల ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మళ్లీ ఉధృతమయ్యాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత మరోసారి ధర్నాకు దిగింది. గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో…

Read Full News

గన్మెన్లు.. బుగ్గ కార్లు.. లగ్జరీ ఆఫీసులు.. ఇదేనా కార్పొరేషన్ చైర్మన్ల పని?

తెలంగాణలో తాజాగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు అప్పగించబడిన కొందరు చైర్మన్లు ఇప్పుడు అధికార దర్భం ప్రదర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి ఆఫీసులు కావాలి.. ఇద్దరు గన్మెన్లు కావాలి.. ప్రభుత్వ వాహనాలు కావాలి.. మంచి జీతం కావాలి అంటూ మంత్రుల చుట్టూ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం…

Read Full News

జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు…

Read Full News

వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read Full News

సెక్రటేరియట్‌లో విజిటర్ అవర్స్ ఫెయిల్?.. అధికారులు లేక ప్రజల ఆవేదన

తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన విజిటర్ అవర్స్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ప్రజలు ఎంట్రీ పాస్ తీసుకొని అధికారులను కలిసేలా ప్రత్యేక సమయం కేటాయించింది. కానీ ఆ సమయంలోనే మెజారిటీ ఐఏఎస్ అధికారులు తమ ఛాంబర్లలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి…

Read Full News

నిజామాబాద్‌పై రేవంత్ నిర్లక్ష్యం.. ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమైంది?

నిజామాబాద్ అభివృద్ధిపై సీఎం Revanth Reddy ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో “కార్పొరేటర్లను గెలిపించండి.. నిజామాబాద్ అభివృద్ధి బాధ్యత నాది.. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా” అని సీఎం ప్రకటించారని గుర్తు చేస్తూ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఖమ్మం, వరంగల్,…

Read Full News

యూరియా కోసం లైన్లు.. ఇప్పుడు ధాన్యం కోసం నిరీక్షణ”.. రైతుల ఆవేదనతో మార్మోగుతున్న మార్కెట్ యార్డులు

తెలంగాణలో రైతుల సమస్యలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ధాన్యం కాంటా వేసి నెల 15 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ ఒక్క బస్తా కూడా ఎత్తుకెళ్లలేదు. అధికారులు మాట్లాడడం లేదు. నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు”…

Read Full News

వరంగల్ రైతుల ఆవేదన.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, లారీలు లేక తీవ్ర ఇబ్బందులు

తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కుతోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడం, లారీలు సమయానికి రాకపోవడం, వర్షాల కారణంగా ధాన్యం తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పంట పండించడానికి పెట్టుబడులు పెరిగిపోయాయి. యూరియా కోసం లైన్లు కట్టాం. ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు భరించాం. ఇప్పుడు పంట చేతికొచ్చాక…

Read Full News

సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్.. కేసీఆర్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్న శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ప్రస్తుతం మాత్రం రాష్ట్రం మళ్లీ సమస్యల బాట పట్టిందన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గురుకుల…

Read Full News

మక్కల బంగారం మాకే భారమైంది”.. రైతుల ఆవేదనలో రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో మక్క రైతుల ఆవేదన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ సమస్యలు, లారీల కొరత, కొనుగోలు ఆలస్యం కారణంగా తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. “ట్రాక్టర్లు దొరకడం లేదు.. లారీలు రావడం లేదు.. బస్తాలు మోసుకుంటూ తిరగడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు మండిపడ్డారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా…

Read Full News