టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత పార్టీనే’.. తెలంగాణ రాష్ట్ర సేనలో చేరిన చిలుక ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్న “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)” పార్టీకి మద్దతుగా జర్నలిస్టు చిలుక ప్రవీణ్ చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓకే టీవీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తనపై జరిగిన దాడులు, రాజకీయ ప్రవేశం, కవిత నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో స్పోక్‌పర్సన్‌గా చేరిన చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ తనపై అనేక కేసులు పెట్టారని ఆరోపించారు….

Read Full News

93 బీసీ కులాల జాబితా వైరల్.. “ఇన్ని కులాలు ఉన్నాయా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన యాంకర్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మరోసారి చర్చ మొదలైంది. ఓకే టీవీ ఇంటర్వ్యూలో 93 బీసీ కులాల జాబితాను ప్రస్తావిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఇన్ని కులాలు ఉంటాయని నాకు తెలియదు” అంటూ యాంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, బీసీ వర్గాల విభజన, చరిత్ర, సామాజిక పరిస్థితులపై ఆసక్తికర చర్చ సాగింది. ఇంటర్వ్యూలో 2007 నాటి “93 బీసీ కులాల ఐక్యవేదిక” క్యాలెండర్‌ను చూపిస్తూ, తెలంగాణలోని బీసీ కులాల…

Read Full News

బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read Full News

నిజం కోసం పోరాటం… ప్రజల గొంతుకగా ఓకే టీవీ ప్రస్థానం

నిజం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఛానల్, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అన్యాయం, అవినీతి, అక్రమాలపై అక్షర యుద్ధం చేస్తూ, సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టడమే ఓకే టీవీ లక్ష్యం. రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తూ, ప్రజాహితాన్ని ప్రధానంగా తీసుకుని వార్తలను అందించడం ఈ మీడియా ప్రత్యేకతగా నిలుస్తోంది….

Read Full News

తెలంగాణలో ఆలయాలపై దాడులు, బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస: ప్రభుత్వాల స్పందన ఎక్కడ? – ఓకే టీవీ చర్చ

తెలంగాణలో ఇటీవల వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, అదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా జరిగిన ప్రత్యేక చర్చలో ఈ అంశాలపై జర్నలిస్ట్ సిద్ధు గారు విస్తృతంగా స్పందించారు. తెలంగాణలో ఆలయాలపై దాడులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుచోట్ల దేవాలయాలపై దాడులు జరిగాయని చర్చలో పేర్కొన్నారు. రక్షాపురం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ముత్యాలమ్మ ఆలయం, హనుమాన్ ఆలయాలు, శంషాబాద్ పరిసర…

Read Full News

శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా కీలక వ్యాఖ్యలు

శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా సంచలన వ్యాఖ్యలు ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీ మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మొత్తం వివాదం చివరకు ఉమెన్ కమిషన్ దాకా చేరింది. ఈ నెల 27వ తేదీన…

Read Full News

టిఎస్ పాలిటిక్స్‌లో గందరగోళం: 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కోర్టు మొట్టికాయలు – కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపీలకు తలకాయ నొప్పులే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం కన్నా అకస్మాత్తుగా పెను చర్చలు మొదలయ్యాయి. ఫిరాయింపుల కేసులో 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు కఠిన వైఖరి తీసుకోవడంతో టిఎస్ పాలిటిక్స్ మొత్తం కుదేలైంది. కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కోర్టు దిక్కరణ కింద నోటీసులు పంపించడంతో కథ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. స్పీకర్‌గా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుల్లో చిక్కుకున్నారు. ధర్మాసనం ఇచ్చిన హెచ్చరిక తర్వాత స్పీకర్…

Read Full News

రేవంత్ ప్రభుత్వ సెలబ్రేషన్స్‌పై విమర్శల వర్షం – ఉద్యమకారులకు హామీలు ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సెలబ్రేషన్లపై వివాదం చెలరేగింది.ప్రభుత్వం ఈ వేడుకల కోసం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (I&PR) విభాగం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓకే టీవీ యాంకర్ శ్రావ్య ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ – “డబ్బులు లేవు, పైసలు లేవు అని చెప్పే ప్రభుత్వం, సెలబ్రేషన్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మా ఉద్యమకారులకు హామీ…

Read Full News

నిరుద్యోగుల వాయిస్‌ను అణచలేరు – యువనాయకుడు వినయ్ విప్లవ్ ఆవేశం

జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:

Read Full News

షామీర్పేట పెద్దమ్మ కాలనీ ప్రజల వేదన – “మాకు ఇళ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు… రేవంత్ అన్న న్యాయం చేయాలి!

తెలంగాణ రాష్ట్రంలోని షామీర్పేట పెద్దమ్మ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజలు తమ దయనీయ పరిస్థితులను కన్నీళ్లతో వ్యక్తం చేశారు. ఆహారం, ఇల్లు, విద్య, నీరు, కరెంట్ ఏదీ సక్రమంగా అందడంలేదని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ –“మాకు ఇల్లు లేదు మేడం. నెలకు ₹4000 కిరాయి కడతాం. పిల్లల్ని చదివించడానికి గతి లేదు. గవర్నమెంట్ స్కూల్‌లో రెండు బుక్స్ ఇస్తారు, కానీ తినడానికి కూడా లేదు. నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు…

Read Full News