తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత యుద్ధం: మీడియా గ్యాంగులు, స్కాములు, ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్‌లపై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు తీవ్ర గందరగోళ స్థితికి చేరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల మధ్య తీవ్ర అసమన్వయం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, భట్టి విక్రమార్క వర్గం మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో మీడియా రెండు శిబిరాలుగా చీలిపోయిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి….

Read Full News

నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read Full News

వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేక సంకేతాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత అసంతృప్తి బయటపడుతోందా?

ఇటీవల ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల ఫీజుల దోపిడీపై వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, అది కేవలం విద్యా వ్యవస్థపై విమర్శగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్ష విమర్శగా కూడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నేను గనుక విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ కాలేజీల ఫీజులను కచ్చితంగా నియంత్రించేవాడిని, కాలేజీలను మూసివేసే వరకు వెళ్తాను” అని వెంకట్ రెడ్డి చెప్పడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి…

Read Full News

బీజేపీ ఆలస్య స్పందన నుంచి కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి వరకు: తెలంగాణ రాజకీయాల్లో మరిగుతున్న ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా—ప్రజా సమస్యల కంటే రాజకీయ లెక్కలే ముందున్నాయన్న భావన బలపడుతోంది. అంతర్జాతీయంగా మెస్సీ మ్యాచ్ జరిగిపోయిన చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం, “ఇప్పుడు నిద్ర లేచారా?” అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్రంలో ఉన్న మంత్రి వెంటనే చర్యలు తీసుకోవచ్చుగా అనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కూడా అనుమానాలు…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు, అరెస్ట్ ప్రచారం రాజకీయ హైప్ మాత్రమే

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని…

Read Full News

తెలంగాణ బీజేపీ పతనం: పార్టీ మార్పులు, నిర్లక్ష్యం, నమ్మకం కోల్పోయిన నాయకత్వం

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ, ఇప్పుడు అంతర్గత నిర్లక్ష్యం, నాయకత్వ వైఫల్యంతో తన స్థానం తానే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, బీజేపీలో చేరిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే వెళ్లాలని…

Read Full News

మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై…

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పైచేయి? బీఆర్ఎస్ పోటీపై అనుమానాలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పైచేయి? బీఆర్ఎస్ పరిస్థితిపై పెరుగుతున్న అనుమానాలు తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో స్పష్టమైన అంచనాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదని, పంచాయతీ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే గెలుపు ఈజీగా కనిపిస్తున్నా కూడా నిర్లక్ష్యం చేయవద్దని, అప్రమత్తంగా పనిచేయాలని మంత్రులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది….

Read Full News

రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు

రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…

Read Full News

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read Full News