డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట.. ఆ రెండు కేసుల్లో వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు

హైదరాబాద్: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కి తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. గత ఎనిమిదేళ్లుగా ఆయనను వెంటాడుతున్న రెండు క్రిమినల్ కేసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్…

Read Full News

నీళ్ల పైపులా? పైసల పైపులా?” – ఎల్బీనగర్ డ్రైనేజ్ పనులపై తీవ్ర ఆరోపణలు, కాంట్రాక్టర్లపై ప్రజా ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్–సరూర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైపులు వేయాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇప్పటికే ఉన్న నీటి పైపులను ధ్వంసం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మీకు పైపులు వేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారా? లేక ఇరగదీయడానికి ఇచ్చారా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు ఎవరూ కనిపించడం లేదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులు ఈ…

Read Full News

సీఎంకు కొత్త హెలికాప్టర్? నెలకు రూ.5 కోట్ల కిరాయి.. గంటకు రూ.10 లక్షల ఖర్చు – ప్రజల డబ్బుపై మరో భారం?

తెలంగాణ ముఖ్యమంత్రి వినియోగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ హెలికాప్టర్‌కు నెలకు సుమారు రూ.5 కోట్ల వరకు అద్దె, గంటకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందనే సమాచారం వెలుగులోకి రావడంతో ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, మరోవైపు సంక్షేమ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపణలు…

Read Full News

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా?

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా? హైదరాబాద్‌లోని పటేల్ చెరువు పరిధిలో ఉన్న లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బఫర్ జోన్ నిబంధనల ఉల్లంఘన, అనుమతుల జారీ, సామాన్య ఫ్లాట్ కొనుగోలుదారుల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అభ్యంతరం.. జీహెచ్‌ఎంసీ అనుమతులు? ఆరోపణల ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూమిలో కొంత భాగం ఇరిగేషన్ శాఖ పరిధిలోని బఫర్…

Read Full News

అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం?

అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం? తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. హోదాతో సంబంధం లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతల అండదండలు ఉన్నా పట్టించుకోకుండా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిఘా వర్గాలకు గ్రీన్…

Read Full News

ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

‘ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ హైదరాబాద్ నగర చరిత్ర, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే శక్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, కులీ కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు నగరాన్ని విస్తరించడంతో ప్రపంచ పటంలో…

Read Full News

హైదరాబాద్ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కబ్జాలే నగర సమస్యలకు మూలమా?

హైదరాబాద్ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కబ్జాలే నగర సమస్యలకు మూలమా? హైదరాబాద్‌లో కురిసిన తొలకరి వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. భారీ వర్షం కాకపోయినా, కేవలం గంట నుంచి రెండు గంటల పాటు కురిసిన వర్షానికే నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి, కొద్ది కిలోమీటర్ల ప్రయాణానికే రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర వరదలపై స్పందిస్తూ పలు…

Read Full News

కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడు? యూరియా కొరత, నష్టపరిహారం లేక అన్నదాతల ఆవేదన

కష్టం కౌలు రైతులది.. భరోసా భూ యజమానులదేనా? యూరియా కోసం మళ్లీ లైన్ల బాటలో అన్నదాతలు తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంట పండించేది కౌలు రైతులే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాత్రం ఎక్కువగా భూ యజమానులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టమంతా కౌలు రైతులదైతే, భరోసా మాత్రం భూ యజమానులకే దక్కుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కౌలు రైతుల గుర్తింపు సాధన…

Read Full News

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న రేవంత్.. రైతుల కష్టాలపై ఎందుకు మౌనం?”

వర్షంలో తడిసిన సీఎం వీడియో వైరల్.. రైతుల గోడు వినేందుకు ఎవరు? మహిళా సాధికారతపై రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం రాజకీయంగా ఆసక్తికర చర్చకు వేదికగా మారింది. మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాకుండా మహిళల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు….

Read Full News

కాంగ్రెస్ కొత్త వ్యూహమా? కేసీఆర్‌ను పక్కనపెట్టి బీజేపీని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి!

కాంగ్రెస్ కొత్త వ్యూహమా? కేసీఆర్‌ను పక్కనపెట్టి బీజేపీని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి! తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ నేతల ప్రసంగాలు ముగిసేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది….

Read Full News