మరోసారి ఏసీబీకి చిక్కిన డీఈ ముత్యం వెంకటరమణ.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులపై దర్యాప్తు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి భారీ అవినీతి కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులు…

Read Full News

7400 పోలీస్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. నాలుగు వారాల్లో పూర్తి షెడ్యూల్ ఇవ్వాలని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న సుమారు **7,400 పోస్టుల భర్తీ ప్రక్రియపై పూర్తి షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. నియామక ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉందో, మిగిలిన పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో స్పష్టమైన వివరాలను కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ అంశంపై హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్…

Read Full News

బస్తీలో కుస్తీలు: రహమత్ నగర్‌లో డ్రైనేజీ దుర్భరం.. మంచినీటి కోసం నిరీక్షణ.. సీఎన్ రెడ్డి పనితీరుపై ప్రజల మిశ్రమ స్పందన

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునే ఓకే టీవీ ప్రత్యేక కార్యక్రమం “బస్తీలో కుస్తీలు” ఈసారి రహమత్ నగర్ డివిజన్‌కు చేరుకుంది. ఇప్పటికే యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమం తర్వాత రహమత్ నగర్‌లో స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా రహమత్ నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, మురుగు నీటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు తెలిపారు. మరోవైపు, మాజీ కార్పొరేటర్ సీఎన్…

Read Full News

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ వివాదం.. మహిళా రైతుల అరెస్టులు, నాన్-బెయిలబుల్ కేసులు కలకలం

శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్నట్లు చెబుతున్న భూసేకరణ మరోసారి వివాదానికి దారితీసింది. తాము దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను కోల్పోతామనే ఆందోళనతో నిరసన చేపట్టిన రైతులను పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకోవడం, మహిళా రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 650 ఎకరాల భూమిపై వివాదం బాధిత రైతుల కథనం ప్రకారం, శంషాబాద్ మండలంలోని సర్వే నంబర్లు 28, 62 పరిధిలో ఉన్న సుమారు 650 ఎకరాల భూమిని…

Read Full News

సోనం వాంగ్‌చుక్‌ను హీరో చేశారు’.. విద్యార్థి ఉద్యమం రాజకీయాల వైపు వెళ్తుందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై చర్చ

విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వాంగ్‌చుక్‌ను నిర్బంధించి జైలుకు పంపడం వల్ల ఆయన దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారని, ప్రభుత్వ వైఖరే ఆయనను హీరోగా మార్చిందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవినీతికి…

Read Full News

గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగడం మానేసి, ఆగస్టు 3 వరకు ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి…

Read Full News

ఒక్క మేయర్ సీటైనా గెలుస్తారా?”.. బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అంతర్గత పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క మేయర్ సీటైనా గెలుస్తుందా అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కలిసి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావాలంటే…

Read Full News

బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్‌బై? శ్రావణంలో బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబం త్వరలోనే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం కూడా కమలం గూటికి చేరుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం…

Read Full News

కృష్ణానగర్‌లో ప్రజల గోడు: డ్రైనేజీ, నీటి సమస్యలతో విసిగిపోయిన యూసఫ్‌గూడ వాసులు.. కార్పొరేటర్‌పై తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్: నగర అభివృద్ధికి ప్రతీకగా చెప్పుకునే హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ముసాగూడ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వర్షాకాలంలో నీటిమునిగే పరిస్థితులు వంటి సమస్యలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత తమ వైపు చూడడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, చిన్నపాటి వర్షం పడినా కృష్ణానగర్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి….

Read Full News

భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన…

Read Full News