రైతులకు గుడ్ న్యూస్ అంటున్న ప్రభుత్వం.. కానీ గిట్టుబాటు ధర, యూరియా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం?
తెలంగాణలో రైతులకు మేలు చేసే చర్యలపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. రైతు వేదికల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోలు వరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల ద్వారా సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే సన్న వడ్లు సాగు చేస్తున్న రైతుల పూర్తి వివరాలను సేకరించాలని,…

