నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read Full News

వరి కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ

తెలంగాణలో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, దేశంలోనే వరి ఉత్పత్తి మరియు వరి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, కొనుగోళ్లు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు…

Read Full News

రాయదుర్గం ఎకరం ₹237 కోట్లు.. రైతుల భూములకు అదే రేటు ఇస్తారా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో భూముల విలువలు, రైతుల నష్టపరిహారం అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో టీజీఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ₹237 కోట్లకు చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 6.29 ఎకరాల భూమిని ₹1490.73 కోట్లకు గౌర వెంచర్స్ దక్కించుకోవడంతో.. “ప్రభుత్వ భూమికి వందల కోట్లు వస్తే రైతు భూమికి ఎందుకు రావు?” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. రావిర్యాల ప్రాంతంలో…

Read Full News

సెక్రటేరియట్‌లో మామూళ్ల దందా?.. పీఏలు, పీఎస్‌ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ సెక్రటేరియట్‌లో మరోసారి అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీల వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైల్ ముందుకు కదలాలంటే మామూల్లు తప్పనిసరి అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అపాయింట్‌మెంట్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా మధ్యవర్తుల దందా నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని తీవ్ర…

Read Full News

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన తెలంగాణ రక్షణ సేన, ధర్మ సమాజ్ పార్టీ నేతలు

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ Telangana Rakshana Sena మరియు Dharma Samaj Party నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో భూసేకరణ, అలాగే టీపీఎల్ఆర్ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ, భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి నీళ్లలో బయటపడిన చేపల మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో…

Read Full News

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు కాకపోవడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రత్యేకంగా యూరియా కొరత, టోకెన్ వ్యవస్థలో గందరగోళం, కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట పండించేందుకు ఎండలోనూ, వర్షంలోనూ కష్టపడి వ్యవసాయం చేసిన రైతులు చివరికి ధాన్యం అమ్ముకునే…

Read Full News

లారీలు పంపించండి.. పంట మొత్తం తడిసిపోతోంది” మార్కెట్ యార్డుల్లో రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, జొన్నలు, ఇతర పంటలు తడిసి నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “జొన్నలు తీసుకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఒక్క లారీ కూడా రాలేదు. పంట మొత్తం తడిసి పోతోంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు….

Read Full News

రిటైర్మెంట్ డబ్బుల కోసం మాజీ ఉద్యోగినీ ఆవేదన.. “మంత్రి సంతకం విలువ ఏంటి?” అంటూ సచివాలయం ఎదుట నిరసన

రిటైర్మెంట్ బకాయిల కోసం ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగినీ సచివాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “మంత్రి స్వయంగా సంతకం చేసినా కూడా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఆ సంతకాల విలువ ఏంటి?” అంటూ ఆమె మీడియా ముందుకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. రిటైర్ అయిన తరువాత దాదాపు రెండేళ్లు గడిచినా కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సహా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆమె వాపోయారు. 2024 మే…

Read Full News

వడ్ల కొనుగోళ్లలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా తూకం లేదు, బీ గ్రేడ్ పేరుతో కోతలు

తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల వ్యవహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 నుంచి 25 రోజులు గడిచినా తూకం వేయకపోవడం, బీ గ్రేడ్ పేరుతో భారీ కోతలు విధించడం, రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మాటల్లో చెప్పాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. “మార్చి 20న వడ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 20 రోజులు దాటిపోయాయి. కొన్ని చోట్ల 24…

Read Full News

18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. జూన్ లోపు అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 18 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తూ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. ఈ నియామకాలలో 16 కుల సంఘాలు, చేతివృత్తిదారుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉండగా, మిగిలిన రెండింటిలో తెలుగు అకాడమీ మరియు గ్రామ…

Read Full News