జీఓ 36 గడువు ముగిసినా స్పందన లేదు.. నిరుద్యోగుల ఆగ్రహం

తెలంగాణలో నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన వయో పరిమితి సడలింపు జీఓ గడువు ముగిసి రెండు నెలలు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లలో మళ్లీ వయో పరిమితిని 34 సంవత్సరాలకు పరిమితం చేయడంతో వేలాది మంది నిరుద్యోగులు అవకాశాలు కోల్పోతున్నారని ఆరోపిస్తున్నారు. ఓకే టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సింధూ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా విమర్శించారు. ఫిబ్రవరిలో జీఓ 36 గడువు ముగిసినప్పటికీ ఇప్పటివరకు…

Read Full News

స్త్రీనిధిలో భారీ అవకతవకలా..? విద్యాసాగర్ రెడ్డి రీన్యువల్, కొత్త నోటిఫికేషన్లపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న నియామకాలు, నిధుల వినియోగం, రిటైర్డ్ అధికారుల కొనసాగింపుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి వ్యవహారంపై నిరుద్యోగ వర్గాలు, కొంతమంది ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాము అనే వ్యక్తి స్త్రీనిధిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యాసాగర్ రెడ్డి రిటైర్మెంట్ వయస్సు దాటిన తర్వాత కూడా పలుమార్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం వెనుక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు…

Read Full News

బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read Full News

ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?”.. పార్టీ మార్పు ప్రచారంపై మల్లారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆయన తాజాగా స్పందించారు. ప్రధాని ని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అంటూ ప్రశ్నిస్తూ తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు బీజేపీలో చేరేందుకు ఐదు సీట్లు కోరినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం…

Read Full News

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read Full News

హైదరాబాద్ ఆత్మ భవనాల్లో కాదు.. సంస్కృతిలో ఉంది” – కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రగతి, నగర సంస్కృతి గురించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ఒక్క వ్యక్తి లేదా ఒక్క నాయకుడు నిర్మించలేదని, ఈ నగరం శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన శైలితో ప్రత్యేకత సాధించిందని పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు ఘనతను ఒక వ్యక్తికి ఇవ్వలేం. ఈ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ ఒక్క రోజులో నిర్మించబడనట్టే హైదరాబాద్ కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది” అని కేటీఆర్ అన్నారు….

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒరిగేదేం లేదు.. అధికారులనే బలిపశువుల్ని చేస్తున్నారన్న శివకుమార్

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం మాట్లాడిన ఆయన, ఈ కేసు విచారణ ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని తెలిపారు. శివకుమార్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఉద్దేశం న్యాయం చేయడం కాదని, రాజకీయ కాలయాపన కోసం…

Read Full News

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. కేసీఆర్ వ్యూహమా లేక అంతర్గత గందరగోళమా?

కల్వకుంట్ల కవిత ఇటీవల నిర్వహించిన కొత్త పార్టీ ప్రారంభోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలా మంది లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, బహిరంగంగా మాత్రం ఎవరూ స్పందించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు…

Read Full News

మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మార్చి 14న అరెస్టైన రోహిత్ రెడ్డి గత 45 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది….

Read Full News

93 కులాల ఉద్యమం నుంచి బీసీ రాజకీయాల దాకా.. కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీసీ రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసేలా కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు 93 కులాలను ఏకం చేస్తూ భారీ సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తాను, అప్పట్లో ఉద్యమం అదే వేగంతో కొనసాగి ఉంటే ఈరోజు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. 93 కులాల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే ప్రయత్నం చేశామని, ప్రతి…

Read Full News