శివ చౌహాన్ క్లారిటీ: మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు

తెలుగు సినీ గాయని Mangli కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో మైక్రో ఫైనాన్స్ స్కాం ఆరోపణలతో మంగళి కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆమె సోదరుడు శివ చౌహాన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. శివ చౌహాన్ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మంగళి…

Read Full News

బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read Full News

ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?”.. పార్టీ మార్పు ప్రచారంపై మల్లారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆయన తాజాగా స్పందించారు. ప్రధాని ని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అంటూ ప్రశ్నిస్తూ తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు బీజేపీలో చేరేందుకు ఐదు సీట్లు కోరినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం…

Read Full News

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read Full News

నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు.. కనీస సౌకర్యాలు కూడా లేవు” అంటూ ప్రజల ఆవేదన

పరిస్థితి దారుణంగా ఉంది.. నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు. వస్తాం అంటారు కానీ ఎవరూ రావడం లేదు. కనీసం మంచిగా చెప్పినా పట్టించుకోవడం లేదు” అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒరిగేదేం లేదు.. అధికారులనే బలిపశువుల్ని చేస్తున్నారన్న శివకుమార్

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం మాట్లాడిన ఆయన, ఈ కేసు విచారణ ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని తెలిపారు. శివకుమార్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఉద్దేశం న్యాయం చేయడం కాదని, రాజకీయ కాలయాపన కోసం…

Read Full News

మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ పేరు ఎందుకు లేదు?.. ఎంపీపై ప్రశ్నలు వెల్లువ

మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లగా, ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయనకు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. జాతీయ పత్రిక “ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్”…

Read Full News

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు శాంతిభద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది….

Read Full News

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. కేసీఆర్ వ్యూహమా లేక అంతర్గత గందరగోళమా?

కల్వకుంట్ల కవిత ఇటీవల నిర్వహించిన కొత్త పార్టీ ప్రారంభోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలా మంది లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, బహిరంగంగా మాత్రం ఎవరూ స్పందించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు…

Read Full News

93 కులాల ఉద్యమం నుంచి బీసీ రాజకీయాల దాకా.. కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీసీ రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసేలా కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు 93 కులాలను ఏకం చేస్తూ భారీ సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తాను, అప్పట్లో ఉద్యమం అదే వేగంతో కొనసాగి ఉంటే ఈరోజు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. 93 కులాల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే ప్రయత్నం చేశామని, ప్రతి…

Read Full News